వైఎస్సార్‌ జయంతి.. ఆహార పదార్థాల వితరణ

24 Jul, 2021 14:54 IST|Sakshi

న్యూజెర్సీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు 800 డాలర్ల విలువైన ఆహార పదార్థాలను డెలావేర్‌ ఫుడ్‌ బ్యాంక్‌కి  డోనేట్‌ చేశారు. నాటా బోర్డ్‌ డైరెక్టర్‌, వైఎస్సార్‌సీపీ కమిటీ సభ్యులు సంగంరెడ్డి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ సభ్యులు చంద్ర దొంతరాజు, అమరవాది శ్రీనివాస్‌, జనార్దన్‌, శ్రీనివాసరెడ్డి కేసవరపు,  రమణ కొట్ట, నిరంజన్‌, హరి, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు