వ్యక్తి పై కత్తితో హత్యాయత్నం

18 Mar, 2023 00:46 IST|Sakshi

పెనమలూరు: ఇద్దరు మిత్రులు మధ్య వివాదం తలెత్తడంతో హత్యాహత్నం ఘటన జరిగింది. సీఐ గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప వసంతనగర్‌కు చెందిన కనుమూరి విజయ్‌ పనీపాటలేకుండా ఇంటి వద్ద ఉంటూ రోజూ మద్యం తాగుతాడు. అయితే గురువారం అదే ప్రాంతానికి చెందిన అతని మిత్రుడు మజీద్‌తో కలిసి రాత్రి పొద్దుపోయే వరకు కామయ్యతోపు వద్ద ఉన్న బార్‌లో మద్యం తాగారు. బార్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత మజీద్‌ ఇంకా మద్యం ఇప్పించమని విజయ్‌ను కోరాడు. దీనికి విజయ్‌ నిరాకరించటంతో కోపంతో మజీద్‌ కత్తితో దాడి చేశాడు. కత్తి గాయాలతో విజయ్‌ విజయవాడ ఆస్పత్రిలో చేరాడు. బాఽధితుడి సోదరుడు వినయ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు శుక్రవారం హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు