పెనమలూరు: తల్లిదండ్రులు మందలించారని వ్యక్తి పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పెనమలూరు సీఐ గోవిందరాజు తెలిపిన వివరాల ప్రకారం తాడిగడప రామానగర్ కాలువ కట్టకు చెందిన వేముల యూరిగగారిన్ (35) ఎంబీఏ చదువుకున్నాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. అతను వాటర్ ప్లాంట్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఈ నెల 25న కుటుంబ సభ్యులతో ద్వారకా తిరుమలకు వెళ్లాలని అనుకున్నారు. యూరిగగారిన్ ద్వారకాతిరుమలకు వెళ్లటానికి రెడీ అవ్వక పోవటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై ఇంటి పక్కన పొలాల్లోకి వెళ్లి కలుపు మందు తాగి ఇంటికి వచ్చాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతనిని పోరంకిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న యూరిగగారిన్ మృతి చెందాడు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.