వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే యువతకు భవిత

27 Mar, 2023 01:28 IST|Sakshi
ప్రసంగిస్తున్న మిథున్‌రెడ్డి

గన్నవరం: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలోనే యువతకు భవిష్యత్‌ అని ఆ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, లోక్‌సభలో పార్టీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎస్‌ఎం కన్వెన్షన్‌ హాలులో ఆదివారం జరిగిన వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం సమావేశానికి మిధున్‌రెడ్డితో పాటు పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శాప్‌ చైర్మన్‌ బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ యువజన విభాగం ఉమ్మడి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్‌గా నియమితులైన జక్కంపూడి గణేష్‌ను సత్కరించారు. అనంతరం మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో జక్కంపూడి రామ్మోహనరావుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. పార్టీ కష్టకాలంలోనూ జక్కంపూడి కుటుంబం జగనన్న వెంటే నిలిచిందన్నారు. వైఎస్సార్‌ సీపీ అభివృద్ధికి ఆయన తనయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పార్టీ అభ్యున్నతికి కృష చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా యువకులను సమాయత్తం చేయాలని సిద్ధార్థరెడ్డి సూచించారు. సమావేశానికి ఉమ్మడి గోదావరితో పాటు కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల నుంచి భారీగా యువత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు