● వైఎస్సార్ సీపీ పాలనలో మెరుగైన సంస్థ ఆదాయం
● ఆక్రమిత స్థలాలపై ఉక్కుపాదం..
ఎక్కడికక్కడ స్వాధీనం
● ఆదాయం పెంచుకునేందుకు పక్కాగా ప్రణాళికలు
● స్థలాల్లో సూపర్ మార్కెట్, గోదాములు, షాపుల
నిర్మాణం
● అద్దెకిచ్చి అదనపు ఆదాయం సముపార్జన
చేసుకునే ప్రయత్నం చేశారు. ఆక్రమణదారులు కొందరు కోర్టుకెళ్లడంతో న్యాయపరంగా పోరాటం చేస్తున్నారు.
● పొందూరు, రణస్థలం, పాలకొండ, మెళియాపుట్టి, ఆమదాలవలస, వీరఘట్టంలో ఉన్న మరికొన్ని ఆస్తులను సర్వే చేసి, రెవెన్యూ పత్రాలు పొంది, ఆ ఆస్తుల రక్షణతో పాటు వాటిని వ్యాపార కేంద్రాలను మార్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు
● గతంలో కొనసాగుతున్న సంప్రదాయంగా ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రభుత్వ సంస్థలకు, ప్రభుత్వ వసతి గృహాలకు, అంగన్వాడీలకు ఆహార దినుసులు, స్టేషనరీ సామగ్రి సరఫరా చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా నిర్వహిస్తున్నారు.
భవిష్యత్ కార్యాచరణ..
● మెళియాపుట్టి, పాలకొండ, హిరమండలంలోని డీసీఎంఎస్ స్థలాలను పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం అద్దెకిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
● పొందూరు గొడౌన్ వద్ద ఐదారు షాపుల నిర్మించి అద్దెకిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
● కత్తెర వీధిలో మూడు నాలుగు షాపులు నిర్మించి, వాటిని అద్దెకిచ్చి ఆదాయం సమకూర్చుకోనున్నారు.
● టెక్కలిలో 2.23ఎకరాల స్థలాన్ని షాపింగ్ మాల్కు అద్దెకివ్వడం ద్వారా లక్షలాది రూపాయల అదనపు ఆదాయం రానుంది.
● డీసీఎంఎస్ ఆఫీస్ వెనక భాగాన ఉన్న స్థలాన్ని ప్రైవేటు స్కూల్కు అద్దెకిచ్చే ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా రూ. 30వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.