-
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగిన ప్రత్యేక స్పందనలో పలాస, మున్సిపాలిటీకి సంబంధించి 110 సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో పలాస తహసీల్దార్ మధుసూదనరావుపై జిల్లా జాయింట్ కలెక్టర ఎం.నవీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కారం చేయకుండా ఏంచేస్తున్నారని, అసలు విధులకు వెళ్తున్నారా అని ప్రశ్నించారు. కార్యాలయంలో పరిష్కారం కావాల్సినవి కూడా ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. కార్యాలయంలో పనితీరుపై అనుమానాలు ఉన్నాయని ఆర్డీవో సీతారామమూర్తి, మంత్రి అప్పలరాజు సమక్షంలో క్లాస్ పీకారు. సమస్యలన్నీ తహసీల్దార్ కార్యాలయం నుంచే తలెత్తుతున్నాయన్నారు.