-

8 తులాల వెండి వస్తువుల చోరీ

31 Mar, 2023 02:24 IST|Sakshi
చోరీ జరిగిన ఇంట్లో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు

భోగాపురం: మండల కేంద్రం భోగాపురంలో మంగళవారం అర్థరాత్రి 8 తులాల వెండి చోరీ జరిగింది. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమాదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామిశెట్టి సాయిలక్ష్మికి ఇద్దరు కుమారులు అనంతకృష్ణ, ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఉద్యోగరీత్యా పెద్ద కుమారుడు డెంకాడ మండలం మహంతిపేట, చిన్న కూమారుడు విశాఖపట్నం జిల్లా పరవాడలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ఉదయం సాయిలక్ష్మి ఇంటికి తాళం వేసుకుని పెద్దకుమారుడి కూమార్తెను చూసేందుకు వెళ్లింది. ఇదే అదునుగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. సెల్ఫ్‌లో ఉన్న తాళాలతో బీరువాను తెరిచి అందులో 8 తులాల వెండి వస్తువులను అపహరించుకుని పారిపోయారు. బుధవారం ఉదయం సాయిలక్ష్మి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచి బీరువాలో సామగ్రి చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో బీరువాలో వెండి వస్తువులు లేకపోయేసరికి భోరుమంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సైలు కృష్ణమూర్తి, మరళీకృష్ణ(క్లూస్‌ టీం) సిబ్బందితో చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, పలు ఆధారాలు సేకరించారు.

మరిన్ని వార్తలు