గమ్యం చేరని లింగరాజు

31 Mar, 2023 02:24 IST|Sakshi
లింగరాజు మహాప్రభువు రుకుణ రథయాత్ర

భువనేశ్వర్‌: లింగరాజు మహాప్రభువు రుకుణ రథం సకాలంలో గమ్యం చేరలేక పోయింది. సూర్యాస్తమయం వేళ కావడంతో రథం లాగడం వాయిదా వేశారు. దీంతో రుకుణ రథం బొఢై బంకొ ప్రాంతంలో నిలిపి వేశారు. రథయాత్రలో భక్తులు అత్యంత ఉత్సాహంతో పాలుపంచుకున్నారు. యాత్ర పూజలు, సేవాదుల్లో ఉదయం నుంచి జాప్యం చోటు చేసుకుందని బ్రాహ్మణ నియోగుల సంఘం కార్యదర్శి బిరంచి నారాయణపతి తెలిపారు. సుమారు రెండున్నర గంటల ఆలస్యం కొనసాగింది. దీంతో బుధవారం సాయంత్రం 6:20 గంటలతో రథయాత్ర నిలిపి వేశారు. తదుపరి యాత్ర గురువారం నిర్వహిస్తారు. రథం ఆగిన బొఢై బంకొ నుంచి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రథం లాగడం ప్రారంభించి, సకాలంలో మౌసీ మా మందిరం గమ్యం చేర్చుతామన్నారు. ఉత్సవ సేవాదుల్లో జాప్యంతో రథం పైకి ఉత్సవ మూర్తుల తరలింపు ఆలస్యంగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించారు. ఈ తంతు ముగించి సాయంత్రం 5:23 గంటలకు రథం లాగడం ప్రారంభించారు.

మరిన్ని వార్తలు