ఒడిశా: గతేడాది విడుదలై, సంచలనం తెలుగు చిత్రం పుష్ప2 దర్శకుడు సుకుమార్, చిత్ర బందం జిల్లాలోని కలిమెల సమితి మన్యంకొండ పంచాయతీ పొల్లేరు గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. సినిమా రెండో భాగం చిత్రీకరణలో భాగంగా మైత్రీమూవీ మేకర్స్ సంస్థ ప్రొడక్షన్ మేనేజర్ పి.వేంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ ఏప్రిల్లో వివిధ ప్రాంతాలను పరిశీలించారు.
అనంతరం మల్కన్గిరి కలెక్టర్ విశాల్సింగ్, ఎస్పీ నితీష్ వాధ్వనీ లను కలిసి, షూటింగ్ నిమిత్తం అనుమతులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 20మందితో కూడిన బృందం దర్శకుడు సుకుమార్, సినిమాటోగ్రఫీ మిరస్లోవ్ కుబ బ్రోచెక్(రష్యా) తదితరులు చిత్రీకరణ చేపట్టనున్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ మల్కన్గిరి జిల్లా ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరని కొనియాడారు.
పొల్లేరు ప్రాంతంలో మరో 2నెలల్లో షూటింగ్ ప్రారంభిస్తామని, పుష్ప1 ఎంతటి ఘన విజయం సాధించిందో.. రెండో భాగం కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో అలరిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. జిల్లాలోని స్వాభిమాన్ ఏరియా హంతాళ్గూడ ఘాట్ రోడ్డు, బలిమెల రిజర్వాయర్, పొల్లేరు చుట్టుపక్కల వంతెనలు, నదులు, కాలువల పరిసరాల్లో చిత్రీకరణకు యోచిస్తున్నట్లు వివరించారు. షూటింగ్లో హీరో అల్లూ అర్జున్, హీరోయిన్ సాయిపల్లవి, రష్మిక, నటులు సునీల్, అజయ్ గౌడ్, సీకాయత్, ఫాహద్ ఫాజల్ తదితరులు రానున్నట్లు ప్రకటించారు.