ప్రతిష్టాత్మకంగా నాడు–నేడు

26 Mar, 2023 02:08 IST|Sakshi

గురజాల: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు–నేడు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఆ పథకాన్ని దుర్వినియోగం చేయకుండా విద్యార్థులకు సద్వినియోగపరచే విధంగా చూడాలని ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ సూచించారు. మండల పరిధిలోని చర్లగుడిపాడు, మాడుగుల గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని, నాడు–నేడు పనులు ద్వారా చేసిన పనులను పరిశీలించారు. నాడు–నేడు పథకం ద్వారా చేపట్టిన పనులకు రాష్ట్ర ప్రభుత్వంకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. పలు పుస్తకాల్లో ఉన్న ప్రశ్నలను చిన్నారులను అడిగి సమాధానం తెలుసుకున్నారు. చిన్నారులు మేథస్సు బాగుందని ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు