అరకులోయ ప్రాంతంలో మాదిరిగా ఇకపై కొండవీడులోనూ నైట్క్యాంపులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీన ప్రస్తుతం సందర్శించిన అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులతో కలిసి కొండవీడులో నైట్ క్యాంప్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. వెదుళ్ల చెరువులో పెడల్ బోటింగ్ ప్రాజెక్టును త్వరలోనే తీసుకువస్తామన్నారు. అలాగే సజ్జామహాల్ నుంచి వెదుళ్ల చెరువు మీదుగా నెమళ్ల బురుజు వరకు రోప్ వే ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. రానున్న కొద్దిరోజుల్లోనే కొండవీడుకు మరిన్ని పర్యాటక శోభను చేకూర్చనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ప్రస్తుతం కొండవీడుకు అప్రోజ్మార్గంలో రావాలంటే పుట్టకోట గ్రామంలో నుంచి రావాల్సి వస్తుందని, అలా కాకుండా గ్రామం వెలుపల ఉన్న మట్టికట్ట పక్కగా 380 మీటర్ల బైపాస్ మార్గం పనుల్ని చేపడతామన్నారు. వారి వెంట నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్, కొండవీడు రేంజ్ అధికారి రమణమ్మ, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి, కొత్తపాలెం సర్పంచి ఎంవీ సుబ్బారావు, ఇతర శాఖల జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.