గురజాల: స్థానిక సబ్జైలును జూనియర్ సివిల్ జడ్జి కె.మంజులత సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలు తాగునీటి వసతి సరిగ్గా లేదని జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన జడ్జి నీటి శుద్ధి యంత్రానికి మరమ్మతులు నిర్వహించి ఖైదీలకు తాగునీటిని అందించాలని ఆదేశించారు. అదే విధంగా ఖైదీలకు వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదుల బాక్స్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆమె వెంట న్యాయవాది కలివెల ప్రభుదాసు ఉన్నారు.