డీసీసీబీ బ్రాంచ్‌ ఏర్పాటుకు స్థలపరిశీలన

8 Mar, 2023 01:58 IST|Sakshi
స్థలాన్ని పరిశీలిస్తున్న సీఈఓ, డీసీసీబీ చైర్మన్‌ వేచలపు వెంకట చినరామునాయుడు

వేపాడ: సెంట్రల్‌ బ్యాంకు బ్రాంచ్‌ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని సిబ్బందితో కలిసి డీసీసీబీ చైర్మన్‌ వేచలపు వెంకట చినరామునాయుడు ఆధ్వర్యంలో డీసీసీబీ సీఈఓ కె.జనార్దన మంగళవారం సాయంత్రం వేపాడలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వేపాడ, మెరకమొడిదాం, దత్తిరాజేరు, భోగాపురం, మెంటాడ మండలం చల్లపేట మన్యం జిల్లాలో గరుగుబల్లిలలో కొత్తబ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సెంట్రల్‌ బ్యాంకు ఏజీఎం లక్ష్మణరావు, ఇంజినీరింగ్‌ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు