హార్దిక్‌కు ‘ఆప్‌’ ఆహ్వానం

16 Apr, 2022 08:51 IST|Sakshi

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గుజరాత్‌ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు హార్దిక్‌ పటేల్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆహ్వానం పలికింది. ‘‘ఆయన సొంతగానే పెద్ద నాయకుడిగా ఎదిగారు. అలాంటి నాయకులు మాకు కావాలి.

అందుకే మా పార్టీలో చేరాలని కోరుతున్నాం’’ అని గుజరాత్‌ ఆప్‌ నేత గోపాల్‌ ఇతాలియా శుక్రవారం చెప్పారు. గుజరాత్‌లో పాటిదార్‌ రిజర్వేషన్ల ఉద్యమంతో తెరపైకి వచ్చిన హార్దిక్‌ పటేల్‌ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు