చంద్రబాబుకు పవన్‌ ఊడిగం చేస్తున్నాడు: మంత్రి అంబటి ఫైర్‌

28 Dec, 2022 15:45 IST|Sakshi

సాక్షి, పల్నాడు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ ఊడిగం చేస్తున్నాడు అంటూ మంత్రి అంబటి ఫైర్‌ అయ్యారు. 

కాగా, మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి కాపులను మోసం చేస్తున్నారు. పవన్‌ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడు. ఒక్కచోట కూడా గెలవలేని పవన్‌ నాపై ఆరోపణలు చేస్తాడా?. చంద్రబాబుకు పవన్‌ ఊడిగం చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాడు’ అని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు