Amit Shah: ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం’

17 Sep, 2021 16:54 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌: తెలంగాణలో 2024లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానని పేర్కొన్నారు. నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అని అమిత్‌ షా అన్నారు.

చదవండి:
తెలంగాణలో కుటుంబ పాలనను అంతం చేస్తాం: బండి సంజయ్‌
తెలంగాణ విమోచన దినోత్సవం: స్ఫూర్తిదాయక పోరాటం

 

మరిన్ని వార్తలు