సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ నుంచి వచ్చిన నడ్డా అబద్దాలను మోసుకొచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఏపీ అప్పులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పిందంతా అవాస్తవమేనని అన్నారు ఆయన. మంగళవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో పేర్ని నాని మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అప్పులపై జేపీ నడ్డా అవాస్తవాలు చెప్పారు. పరిమితికి మించి అప్పులు చేస్తే.. కేంద్రం ఏం చేస్తోందని పేర్ని నాని నిలదీశారు. నడ్డా ఏపీకి వచ్చేముందు ఆర్థిక మంత్రిని వివరాలు అడిగి తెలుసుకుని రావాల్సి ఉండాల్సిందని సూచించారు.
‘‘దేశ అప్పు రూ. 130 లక్షల కోట్లకు చేర్చిన ఘనత బీజేపీది. 80 లక్షల కోట్ల రూపాయల అప్పులను చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న మోదీ ఇచ్చారా? ప్రతి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీని నేరవేర్చారా? కులాలు, మతాల పేరుతో దేశంలో రాజకీయం చేస్తున్నది ఎవరు? ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోంది ఎవరు?’’ అంటూ ప్రశ్నించారు పేర్ని నాని.
ఏపీకి వచ్చిన జేపీ నడ్డా.. పోలవరం ప్రాజెక్టు గురించి ఒక్కమాటైన చెప్పారా? పెండింగ్ బిల్లులు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. ఆయుష్మాన్ భారత్ పుట్టకముందే.. ఏపీలో ఆరోగ్యశ్రీ ఉందని పేర్ని నాని గర్తుచేశారు.