ఆ పేపర్‌ దేనికీ పనికి రాదు: అనిల్‌ కుమార్‌

15 Nov, 2020 17:25 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పోలవరంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తోందని మంత్రి అనిల్ కుమార్‌ అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించారని తప్పుడు కథనం ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు తుడుచుకోవడానికి కూడా ఆ పేపర్ పనికి రాదని ఎద్దేవా చేశారు. దిక్కుమాలిన పేపర్లు అడ్డం పెట్టుకుని చంద్రబాబు పిచ్చి రాతలు రాయిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో దాక్కుని కారు కూతలు కూయొద్దని హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

‘పోలవరం ఎత్తు తగ్గించారని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవు. పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించేది లేదు. పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. పోలవరం ప్రారంభం రోజున చంద్రబాబుకు కొత్త బట్టలు పంపిస్తాం.. చంద్రబాబు వచ్చి పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కూడా కొలుచుకోవచ్చు. 2017లో పోలవరంపై కేంద్ర కేబినెట్‌ నోట్‌ను చంద్రబాబు చదివి వినిపించాలి? 2017లో మీరు కేబినెట్‌లో ఏ ఒప్పందం చేసుకున్నారో చెప్పగలరా? పోలవరం గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు. పోలవరం నిర్వాసితుల గురించి చంద్రబాబు ఎప్పుడైనా ఆలోచించారా? కమీషన్ల కోసం ఆలోచించారే తప్ప నిర్వాసితులతో ఎప్పుడైనా మాట్లాడారా? పోలవరాన్ని వైఎస్ఆర్‌ ప్రారంభించారు.. వైఎస్ జగన్ పూర్తి చేస్తారు’అని మంత్రి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు