శాసన మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ వీరంగం

1 Dec, 2020 17:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : శాసన మండలిలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ వీరంగం సృష్టించారు. పంచాయతీరాజ్ సవరణ చట్టంపై చర్చ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై అసభ్య పదజాలంతో దూషించారు. చూసుకుందాం రా అంటూ హెడ్‌ఫోన్‌ విసిరేసి మంత్రి వెల్లంపల్లి వైపు దూసుకొచ్చారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులు రాజేంద్రప్రసాద్‌ని అడ్డుకున్నారు. కాగా, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ తీరును వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. 
 

మరిన్ని వార్తలు