‘చంద్రబాబును నమ్మరు.. 14 ఏళ్లలో ఏం చేశారో అందరూ చూశారు’

17 Nov, 2022 14:49 IST|Sakshi

సాక్షి, నంద్యాల జిల్లా: చంద్రబాబును ఎవరూ నమ్మరని, 14 ఏళ్లలో ఏం చేశారో అందరూ చూశారని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని మండిపడ్డారు.

చంద్రబాబుకు రాయలసీమలో పర్యటించే హక్కులేదని, రైతులు గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు తలకిందులు తపస్సు చేసిన ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు మాటలకు, పనులకు పొంతన ఉండదని అంజాద్‌ బాషా ధ్వజమెత్తారు.
చదవండి: ‘చంద్రబాబు కోరిక తప్పక తీరుతుంది.. దేవుడు తథాస్తు అంటాడు’

మరిన్ని వార్తలు