చిత్తూరు జిల్లా: జోరందుకున్న ఏకగ్రీవాలు

4 Feb, 2021 16:52 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ తరువాత చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. రామచంద్రా పురం మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా... నారాయణవనం మండలం లోని 19 పంచాయితీలలోని ఐదు పంచాయతీల్లో కూడా వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులే ఏకగ్రీవం కావడం విశేషం. అంతేగాక పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలంలోని పది గ్రామ పంచాయితీలలో కూడా ఇదే తరహాలో ఏకగ్రీవాలు జరిగాయి.(చదవండి: వైఎస్సార్‌ జిల్లా: ఏకగ్రీవాలు ఇవే!)

ఏకగ్రీవ పంచాయతీలు
రాయల చెరువు-మాదాసు మురగదాస్
సి. రామాపురం-సుబ్రమణ్యం రెడ్డి
కొత్త వ్యాప కుప్పం-ఇస్మాయిల్ రెడ్డి

నారాయణవనం మండలం
నారాయణవనం టౌన్‌-  శారద
భీముని చెరువు- మురుగేశన్‌, 
బొప్పరాజుపాళ్యం- మునికుమారి, 
కసింమిట్ట- శశికళ,
తిరువట్యం- నాగూర్‌

పూతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలం
కొత్త పాలెం- జి. లోకేష్‌
మోదం పల్లి- ఎం. సుబ్బులు
బొమ్మ సముద్రం- వి. రఘు
చిన్న కాలపల్లి-మనోరంజిని
ఎం పైపల్లి- జమున
పూర్తి మర్ది- పి. సుశీలమ్మ
కొత్తపల్లి- కె. బాలాజీ
మడి కొత్తపల్లి- కవిత
పొలకల- వై. వాసంతి
ఇరువారం పల్లి- కె. సులోచన

ఇక పూతలపట్టు పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు గాను 12 మంది సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో 11 మంది సర్పంచులు వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు కాగా, ఒకరు టీడీపీకి మద్దతుదారుగా ఉన్నారు. 

నగిరి మండలం వి.కె.ఆర్.పురం సర్పంచిగా నందిని ఏకగ్రీవం
వేలవాడి-  చంద్రకళ
బుగ్గ అగ్రహారం- రవికుమార్
ఆయనంబాకం- శేఖర్
విజయపురం- మురళీకృష్ణ

విజయాపురం మండలం
మాధవరం- మమత
శ్రీహరిపురం-జ్యోతి
కోసలనగరం- ఉమా మహేశ్వరి

మరిన్ని వార్తలు