కాంగ్రెస్ అనేది బీజేపీకీ ఆశాకిరణమే తప్ప.. గోవా ప్రజలు కాదు అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం ట్విట్టర్లో సోమవారం చేసిన పోస్ట్కి ప్రతిస్పందనగా కేజ్రీవాల్ ఈ కౌంటర్ ఇచ్చారు.
The choice before the voter in Goa is stark and clear. Do you want a regime change or not?
I appeal to the voters of Goa to vote for a regime change and vote Congress.
— P. Chidambaram (@PChidambaram_IN) January 17, 2022
ఆప్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఓట్లను చీల్చి.. బీజేపీని గెలుపునకు కారణమవుతున్నాయని కేజ్రీవాల్ చెబుతున్నారంటూ చిదంబరం ట్విట్టర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆప్ నేత కేజ్రీవాల్ ‘ఆ ఏడుపు ఆపండి సార్.. ఇప్పటికే 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 15 మంది బీజేపీలోకి చేరిపోయారు’’ అంటూ ఘాటుగా స్పందించారు. తద్వారా కాంగ్రెస్కి పడాల్సిన ప్రతి ఓటు బీజేపీకి ఖాతాలో పడిపోతుందంటూ వ్యాఖ్యానించారు.
सर, रोना बंद कीजिए- “हाय रे, मर गए रे, हमारे वोट काट दिए रे”
Goans will vote where they see hope
Cong is hope for BJP, not Goans.15 of ur 17 MLAs switched to BJP
Cong guarantee- every vote to Cong will be safely delivered to BJP. To vote BJP, route thro Cong for safe delivery https://t.co/tJ0cswgi74
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 17, 2022
పైగా బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్కి రావల్సిన ప్రతి ఓటు సురక్షితంగా బీజేపీ ఖాతాలో పడిపోవడం ఖాయం కాబట్టి కాంగ్రెస్నే గెలిపించండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు కేజ్రీవాల్. ఐదు రాష్ట్రాల్లో పంజాబ్, గోవాలను ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.