స్టీల్‌ ప్లాంట్‌పై చంద్రబాబుది పూటకో మాట

22 May, 2021 16:34 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌పై డ్రామాలు ఆడేదే చంద్రబాబని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ విశాఖ స్టీల్‌ ప్లాంట్ కోసం చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. ప్రజల ఆకాంక్ష మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ తీర్మానం చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీకి రెండు సార్లు ముఖ్యమంత్రి లేఖ రాశారు’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు