పొలిటికల్‌ గేమ్‌.. సీఎం కేసీఆర్‌కు భారీ ఆఫర్‌ ఇచ్చిన బండి సంజయ్‌

29 Aug, 2022 21:02 IST|Sakshi

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. ఇక, బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్న క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య దాడులు సైతం జరిగాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబర్‌ 12 నుంచి నాలుగో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నాను. అయితే, ఎలాంటి బందోబస్తు లేకుండా కేసీఆర్ పాదయాత్ర మొదలుపెడితే నేను ప్రజాసంగ్రామ యాత్ర ఆపేస్తాను. రాష్ట్రానికి కేసీఆర్‌ ఏం చేశారో చెప్పకుండా బీజేపీని తిడుతున్నారు. బీజేపీని తిట్టడానికే కేసీఆర్‌ బహిరంగ సభలు పెడుతున్నాడు. 

లిక్కర్‌ దందాలో ఎవరి భాగస్వామ్యం ఉంది. మానవ అక్రమ రవాణాలో ఎవరి పాత్ర ఉంది. లిక్కర్ స్కామ్‌తో తన కుటుంబానికి సంబంధంలేదని కేసీఆర్‌ ఎందుకు చెప్పడం లేదు. సీఎం ఫ్యామిలీ స్వయంగా వారి పరువు వారే తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియాతో కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పెద్దపల్లి జిల్లాకు ఏం చేశారో కేసీఆర్‌ చెప్పాలి. ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌ సభలో కలకలం.. పోలీసుల అలర్ట్‌తో తప్పిన ప్రమాదం

మరిన్ని వార్తలు