చేనేతలను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌

30 Oct, 2022 01:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేనేత సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేనేత కార్మికులను మోసం చేస్తోందని, ఉపఎన్నికలో రాజకీయ ప్రయోజనం పొందేందుకే చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీ పన్ను విధింపు అంశాన్ని తెరపైకి తెచ్చి వారిని మరోసారి మోసం చేస్తుందని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. తమను అన్నివిధాలుగా మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు చేనేత కార్మికులు మునుగోడులో తగిన గుణపాఠం నేర్పించాలని శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు