లంకా దినకర్‌కు బీజేపీ షోకాజ్‌ నోటీస్

28 Jul, 2020 05:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: పార్టీ నిర్ణయాలకు భిన్నంగా టీవీ చర్చల్లో మాట్లాడుతున్న లంకా దినకర్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. 
► గత ఎన్నికల వరకు టీడీపీలో కొనసాగి తర్వాత ఆయన బీజేపీలో చేరారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలను కొందరు టీడీపీ నేతలకు చేరవేస్తున్నట్టు దినకర్‌పై ఆరోపణలున్నాయి. 
► ఈ నేపథ్యంలో ఆయన నుంచి వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసినట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.
► ఇదే కారణంతో మరికొందరు నేతలకూ నోటీసులు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు