ప్రగతిభవన్ బాగుంటే సరిపోతుందా? 

22 Nov, 2020 19:17 IST|Sakshi

సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన కిషన్‌రెడ్డి

ఫిలింనగర్‌లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి జవదేకర్

సాక్షి, హైదరాబాద్‌: నగర అభివృద్ధిపై కేటీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఫిలింనగర్‌లో బీజేపీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి జవదేకర్ ఆదివారం ప్రారంభించారు. కిషన్‌రెడ్డి, డీకే అరుణ, చింతల రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని, టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: ‘ఓట్ల కోసం ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు’)

పేదల కష్టాలను పట్టించుకోవడంలేదు: డీకే అరుణ
కేసీఆర్‌, కేటీఆర్‌లు హైదరాబాద్‌ను వరదల నగరంగా మార్చారని డీకే అరుణ ధ్వజమెత్తారు. వరద బాధితులను సీఎం కేసీఆర్ పరామర్శించకపోవడం దారుణమన్నారు. ప్రగతిభవన్ బాగుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు.పేదల కష్టాలను సీఎం పట్టించుకోవడంలేదని ఆమె విమర్శలు గుప్పించారు. (చదవండి: ‘వరద సాయాన్ని వారే మింగేశారు..!’)

మరిన్ని వార్తలు