సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత ఎ.చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే తనను సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను సీఎం అయింది ఎంత నిజమో.. దళితబంధు కూడా అంతే నిజం.. కేసీఆర్ హామీకి మాజీ స్పీకర్ మధుసూదనాచారే సాక్ష్యం’’ అని అన్నారు.