చంద్రబాబు మాకొద్దు.. ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో కనిపించని బాబు ఫొటో

21 May, 2023 08:46 IST|Sakshi
జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల ఫ్లెక్సీల్లో కనిపించని చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలు 

సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించలేదు. ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు బొమ్మను పెట్టేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఇష్టపడలేదు. టీడీపీ ముఖ్య నేతలు ప్రాధేయ­పడ్డా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తిరస్కరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి, పార్టీని లాక్కుని ఆయన మరణానికి కార­­ణమైన వ్యక్తి ఫొటోను పెడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని జూనియర్‌ అభిమానులు అభిప్రా­యం వ్యక్తం చేశారు.

తిరుపతి నగరంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఘనం­గా నిర్వహించారు. తిమ్మినాయుడు­పాళెం వ­ద్ద ఎన్టీ­ఆర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్‌ అభిమా­నులు భారీ ఫ్లెక్సీ­లు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేశారు.
చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి 

అ­యి­తే వీటిలో ఎక్కడా చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించకుండా జాగ్రత్తప­డ్డారు. విగ్ర­హా­విష్కర­ణకు వచ్చి­న ముఖ్య నేతలు చెప్పినా వారు పట్టించుకోలేదు. కాగా, ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు లేవని కొందరు దౌర్జన్యంగా వాటిని తొలగించారు.

మరిన్ని వార్తలు