ఉప సర్పంచ్‌ వేధిస్తున్నారు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా

16 Aug, 2021 07:54 IST|Sakshi
మాట్లాడుతున్న మహేందర్‌గౌడ్‌

సాక్షి, హుజూరాబాద్‌ (కరీంనగర్‌): గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచ్‌ గుజ్జ జయసుధ సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌ సర్పంచ్‌ నేరెళ్ల మహేందర్‌గౌడ్‌ ఆరోపించారు. సోమవారం గ్రామంలో మీడియాతో ఆయన గోడు వెళ్లబోసుకున్నారు.

అప్పులు తెచ్చి, గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేశామని, 10 నెలలవుతున్నా చెక్కులపై ఉప సర్పంచ్‌ సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డీఎల్‌పీవో విచారణ జరిపి వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఆర్థికంగా చితికిపోయిన తనకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే చావే శరణ్యమని అన్నారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ సోమవారం సీఎం కేసీఆర్‌ సభలో ఆత్మహత్య చేసుకుంటానని మహేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు