‘అధికారంలోకి వస్తే పాత పింఛను విధానం’.. హస్తం, ఆప్‌ హామీలు

21 Sep, 2022 08:11 IST|Sakshi

న్యూఢిల్లీ/వడోదర: గుజరాత్‌లో తాము అధికారంలోకి వస్తే పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ, ఆప్‌ ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ఇదే చేశామంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వడోదరలో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇదే హామీ ఇచ్చారు. ఉద్యోగులు డిమాండ్ల సాధనకు రోడ్లెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.

ఇదీ చదవండి: హిజాబ్‌పై నిషేధం సబబే

మరిన్ని వార్తలు