హుజూరాబాద్‌ ఫలితంపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌.. 13న ఢిల్లీకి రావాలంటూ..

10 Nov, 2021 15:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఫలితాలపై కాంగ్రెస్‌ అధిష్టానం సీరియస్‌ అయ్యింది. ఉప ఎన్నికలో ఓటింగ్‌ శాతం పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నిక ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. ఈ నెల 13న పీసీసీ నేతలు ఢిల్లీకి రావాలంటూ టీ కాంగ్రెస్‌ నేతలకు హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. కాగా, ఉప ఎన్నిక ఓటమిపై ఇప్పటికే అదిష్టానం కమిటీ వేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు