కోమటిరెడ్డి వ్యాఖ్యలతో నష్టం లేదు: జగ్గారెడ్డి 

17 Feb, 2023 02:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంపీ కోమటిరెడ్డి ఒక టి మాట్లాడితే మరో విధంగా మీడియాలో వచ్చిందని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మా ణిక్‌రావ్‌ ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల సన్నద్ధతలపై చ ర్చించారు. అనంతరం జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను కూడా త్వరలో నే పాదయాత్ర మ్యాప్‌ను ప్రకటిస్తానని చెప్పారు.    

మరిన్ని వార్తలు