‘ఆరోగ్యశ్రీలో చేర్చాలి’

27 Jul, 2020 04:12 IST|Sakshi

జగిత్యాలటౌన్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తికి చేరువైందని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.  ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం 18వ స్థానంలో నిలవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. ఏపీలో ఇప్పటికి 15 లక్షల పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణలో కేవలం 4 లక్షలకే పరిమితమవడం బాధ్యతారాహిత్యమేనన్నారు. వైరస్‌ సోకితే ప్రభుత్వం క్వారంటైన్‌ సదుపాయం కల్పించాలని కోరారు.  

మరిన్ని వార్తలు