బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు నార్కో టెస్టులు చేయాలి 

9 Sep, 2021 03:13 IST|Sakshi

అక్టోబర్‌ 3 నుంచి ఢిల్లీలో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు: నారాయణ  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలనే అంశంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లకు చిత్తశుద్ధి లేదని, ఈ విషయంలో ఆ రెండు పార్టీలకు నార్కో పరీక్షలు చేయించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్‌ అజీజ్‌ పాషాతో కలసి హైదరాబాద్‌ మఖ్దూంభవన్‌లో బుధవారం మీడియాతో నారాయణ మాట్లాడారు.

విజయవాడలో జాతీయ మహాసభ 
అక్టోబర్‌ 3 నుంచి 4 వరకు ఢిల్లీలో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించనున్నట్లు నారాయణ తెలిపారు. జాతీయ మహాసభను విజయవాడలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మోదీకి పరిపాలించే నైతిక హక్కు లేదని, మోదీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ 19 రాజకీయ పార్టీలు ఈ నెల 27న భారత్‌ బంద్‌ చేపడుతున్నాయన్నారు. 

మరిన్ని వార్తలు