‘ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు.. కేసీఆర్‌నే అడగండి’

17 Jul, 2021 01:06 IST|Sakshi

నిజామాబాద్‌ అర్బన్‌: తన రాజకీయ జీవితంపై రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియదు. కేసీఆర్‌నే అడగండి’ అని డీఎస్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌లో శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. తన కుమారుడు, మాజీ మేయర్‌ సంజయ్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని కలవడం ఆయన ఇష్టమన్నారు. మరో కుమారుడు అర్వింద్‌ బీజేపీలో చేరి ఎంపీగా గెలిచాడన్నారు.

మరిన్ని వార్తలు