Divyavani On TDP Leaders: టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు

22 Jun, 2022 19:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ నుంచి బయటకొచ్చాక పనికిమాలిన చెత్త వెధవలు నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అహర్నిశలు పార్టీ కోసం కష్టపడినా గుర్తింపు లేకనే బయటకు వచ్చేశానన్నారు.

ఈ మేరకు దివ్యవాణి మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీకోసం నిజాయితీగా పనిచేసిన నాకు అన్యాయం చేశారు. టీడీ జనార్దన్ కోవర్టులతో తప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. తెలంగాణలో టీడీపీకి ఏ పరిస్థితి వచ్చిందో ఏపీలో అదే పరిస్థితి వస్తుంది. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టే అందరి ఆధారాలు బయటపెడుతున్నాని' దివ్యవాణి అన్నారు.

చదవండి: (CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు)

మరిన్ని వార్తలు