ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు

4 May, 2021 15:29 IST|Sakshi

మంత్రుల వ్యాఖ్యలకు ఈటల రాజేందర్‌ కౌంటర్‌

సాక్షి, హుజూరాబాద్‌: మంత్రి హోదాలో తాను ప్రగతిభవన్‌కు వెళ్లినా అనుమతించలేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మంత్రుల వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర లేదనడం సరికాదన్నారు. తనపై విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసు. తనకు గౌరవం, గుర్తింపు ఇవ్వలేదని అనలేదని ఆయన పేర్కొన్నారు. తాను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే చెప్పానని ఈటల అన్నారు.

చదవండి: ఈటల రాజేందర్‌ మేక వన్నె పులి; మంత్రుల కౌంటర్‌
Etela:హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం

మరిన్ని వార్తలు