సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రేపు(సోమవారం) బీజేపీ అగ్రనేతలతో ఆయన భేటీ అయ్యేఅవకాశం ఉంది. ఈటల వెంట ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత వివేక్ కూడా ఢిల్లీకి వెళ్లారు. రేపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లనున్నారు.