తాడికొండ టీడీపీలో కాకరేపుతున్న వివాదం.. అక్కడ ఏం జరుగుతోంది?

27 Apr, 2023 16:17 IST|Sakshi

సాక్షి, గుంటూరు జిల్లా: తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఫ్లెక్సీల వివాదం కాకరేపుతోంది. చంద్రబాబు మేడికొండూరు పర్యటనలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమయ్యింది.

బాబు రాక సందర్భంగా టీడీపీ నేత తోకల రాజవర్థన్‌రావు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌కుమార్‌ ఆ ప్లెక్సీలను తీయించివేశారు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన తోకల రాజవర్థన్‌రావు వర్గీయులు.. తెనాలి శ్రావణ్‌కుమార్‌తో పాటు అతని అనుచరులపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
చదవండి: ‘కోడెల మరణానికి చంద్రబాబే ప్రధాన కారణం’

మరిన్ని వార్తలు