యడ్డీని ఎవరూ టార్గెట్‌ చేయలేరు

22 Oct, 2021 07:14 IST|Sakshi

సాక్షి, గంగావతి (కర్ణాటక): మాజీ సీఎం యడియూరప్పను టార్గెట్‌ చేసే శక్తి  ఎవరికీ లేదని ఆయన కుమారుడు బీ.వై. విజయేంద్ర అన్నారు. ఆయన సింధగి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గం మధ్యలో కొప్పళ గవిమఠాన్ని సందర్శించి గవిసిద్దేశ్వర స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పాత్రికేయులతో మాట్లాడారు.

సింధగి, హానగల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు.  చంద్రశేఖర్‌ పాటిల్, కనకగిరి ఎమ్మెల్యే ధడేసూగూరు బసవరాజ్, అమరేష్‌ కరడి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు