టీడీపీ బాగోతం బయటపెట్టిన బీకే పార్థసారథి

21 Nov, 2022 09:47 IST|Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా: రూ. కోట్లు ఉంటేనే టీడీపీ టికెట్‌ వస్తుందంటూ శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి తమ పార్టీ బాగోతాన్ని బయటపెట్టారు.

బాగా డబ్బు సంపాదించి రాజకీయాల్లోకి రావాలని, ఉత్తి చేతులతో వస్తే ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు. శింగనమల నియోజకవర్గం నార్పలలో జరిగిన కురుబ కులస్తుల సమావేశంలో టీడీపీ డబ్బు సిద్ధాంతాన్ని  బీకే పార్థసారథి బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: బూతుల మోతాదు పెంచిన చంద్రబాబు.. పీక్స్‌లో ఫ్రస్టేషన్‌!

మరిన్ని వార్తలు