‘టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు’

13 Oct, 2021 17:28 IST|Sakshi

చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, వైఎస్సార్‌ కడప: గత ప్రభుత్వం బద్వేల్‌ అభివృద్ధిని పట్టించుకోలేదని చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తాము బ్రహ్మంసాగర్‌ ద్వారా 7 మండలాలకు నీరు అందించామని తెలిపారు.

బద్వేల్‌కు తాగు, సాగు నీటిని అందిస్తున్నామని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.130 కోట్లతో బద్వేల్‌ మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. 
 

మరిన్ని వార్తలు