పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు రూ.5లక్షల సాయం
వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మాణికం ఠాగూర్
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం గ్రేటర్ ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. గ్రేటర్లో గెలిపిస్తే.. వరద బాధితులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు ఇస్తామంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణికం ఠాగూర్ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో నగర అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలను వివరిస్తూ... పలు రకాల వరాలను ప్రకటించారు. గ్రేటర్లో గెలిస్తే.. ఉచితంగా 30 వేల లీటర్ల మంచి నీటిని అందిస్తామన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన హామీలు