తొలి రోజు 17 మంది.. 20 నామినేషన్లు

18 Nov, 2020 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు గాను నామినేషన్లు ప్రారంభమైన తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలైన 20 నామినేషన్లలో టీఆర్‌ఎస్‌ 06, బీజేపీ 02, కాంగ్రెస్‌ 03, టీడీపీ 05, గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఒక నామినేషన్‌ వచ్చింది. మరో ముగ్గురు స్వంతత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. 150 వార్డులకు గాను డిసెంబర్‌ 1న ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు అఖరు తేది నవంబర్‌ 20 కాగా, 21న నామినేషన్లు పరిశీలించి, 22న ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. 

మరిన్ని వార్తలు