జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: సైకిల్‌ పంక్చర్‌!!

4 Dec, 2020 19:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 150 స్థానాలకు గానూ ఈ సారి 106 డివిజన్లలో పోటీ చేయగా ఒక్కటి కూడా గెలవలేదు. ఏ డివిజన్‌లోనూ డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయింది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా 82 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక వార్డు మాత్రమే గెలుచుకుంది. ఈ సారి ఆ ఒక్క వార్డు కూడా గెలుచుకోలేకపోవటం గమనార్హం. ( గ్రేటర్‌ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే..)

కాగా, గతంలో టీడీపీతో పొత్తులో భాగంగా 68 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ 4 స్థానాలు గెలిచింది. ఈ సారి 150 స్థానాల్లో పోటీ చేసి 49 డివిజన్లను కైవసం చేసుకుంది. ఇక టీఆర్‌ఎస్‌ 56, ఎమ్‌ఐఎమ్ 43‌ స్థానాలు సొంతం చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు