సాక్షి, ఢిల్లీ: మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు (Gone Prakash rao)పై దాడికి యత్నం జరిగింది. ఢిల్లీలో గోనెను బీసీ సంఘాల నేతలు కొందరు కొట్టేందుకు యత్నించారు.
ఢిల్లీ ఏపీ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన గోనె.. ఆ క్రమంలో కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. అది గమనించిన బీసీ సంఘాల కార్యకర్తలు కొందరు.. గోనె ప్రకాశ్ను నెట్టేసి దాడికి యత్నించారు.