Kodali Nani: దత్త పుత్రుడిని, సొంత పుత్రుడిని తుక్కుతుక్కుగా ఓడించాం

28 Jun, 2022 14:36 IST|Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: పనికిమాలిన 420లు అంతా అ‍మ్మఒడి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేట్స్‌ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి మూడేళ్లలోనే రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం దేశంలో ఎవరైనా ఉన్నారా? అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. 

మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ.. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ నిర్వహణకోసం రూ.2 వేలు తీసుకుంటున్నాం. 75% హాజరు ఉన్న ప్రతి విద్యార్ధికి అమ్మ ఒడి అందించాం. చంద్రబాబుకి సిగ్గూ శరం లేదు. చంద్రబాబు నీ జీవితంలో రూ.18 లక్షలైనా ఖర్చు చేశావా. రామోజీరావు, బీఆర్ నాయుడు, దత్తపుత్రుడికి కళ్లు కనిపించడం లేదా?. చంద్రబాబు 14 ఏళ్లలో ఏడాదికి ఒకటి మెడికల్‌ కాలేజీ చొప్పున కట్టినా జిల్లాకొకటి ఉండేది. జగన్ సీఎం అయిన తర్వాత 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. రూ.20 వేల కోట్లు పిల్లలకు ఖర్చు చేస్తుంటే.. దీన్నే మంటారు మీ పిండాకూడా అంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జగన్ మంచి చేస్తుంటే ఈ 420లు అంతా కలిసి వెనుక గోతులు తవ్వుతున్నారు. సామాజిక న్యాయం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పించారు. తెలుగుదేశం అధికారంలో ఉంటే బీసీలకు జడ్పీ చైర్ పర్సన్‌ వచ్చుండేదా. టీడీపీ ఏనాడూ సీఎం జగన్ ప్రభుత్వం మాదిరి సంక్షేమాన్ని అందించలేదు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 

చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి ఒక బ్రాండ్‌.. దెబ్బకు బాబుకు నిద్ర పట్టడం లేదు)

చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి తీరుతాం
ఎన్టీఆర్ వారసుడిగా జగన్ బీసీ, వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇచ్చామంటే ఇచ్చాం అని కాకుండా కీలక శాఖలను వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. జగన్‌ను ఎదిరించలేక టీడీపీ మీడియా డిబేట్లు పెడుతుంది . డిబేట్లు పెట్టేవాడు.. మాట్లాడేవాడు హైదరాబాద్‌లోనే ఉంటారు. దమ్ముంటే టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదు?. చంద్రబాబు చవట దద్దమ్మ. మమ్మల్ని చంద్రబాబు ఓడిస్తాడట. 2019లో నీ దత్త పుత్రుడిని రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించాం. నీ సొంత కుమారుడిని మంగళగిరిలో ఓడించాం. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలోనూ ఓడించి తీరుతాం. 2024లో నేను మళ్ళీ గెలుస్తాను అని కొడాలి నాని అన్నారు.

ఆ పార్టీని కూకటి వేళ్లతో పీకి పడేస్తా
ఎన్టీఆర్ మా ఆస్తి.. మాకోసం పార్టీ పెట్టిన దేవుడు ఎన్టీఆర్. నువ్వెవడివిరా.. చంద్రబాబు. అన్నగారికి వెన్నుపోటు పొడిచి.. పార్టీలాక్కున్న నీచుడు, 420 చంద్రబాబు. చంద్రబాబును, ఆ పార్టీని కూకటి వేళ్లతో పీకి పడేస్తా. చంద్రబాబు, రామోజీరావు, బీఆర్ నాయుడు, రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. వైఎస్సార్ బ్రతికి ఉంటే ఈ రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడేవాడు. వైఎస్ వారసుడిగా మనకు మంచి చేస్తున్న జగన్ మోహన్ రెడ్డికి మనం అండగా నిలవాలి. చావైనా.. బ్రతుకైనా జగన్ వెంటే ఉంటానని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు.

మరిన్ని వార్తలు