Huzurabad Bypoll: అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌

2 Oct, 2021 19:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అధికార పార్టీతో పాటు విపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో అన్ని పార్టీలు స్థానికంగా పట్టు ఉన్న నేతలనే తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌లో బరిలో నిలవబోయే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ని తమ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. శనివారం ఏఐసీసీ బల్మూరి వెంకట్‌ పేరుని అధికారికంగా ప్రకటించింది. 

చదవండి: Huzurabad Bypoll: గెల్లుతో బల్మూరి ఢీ!

మరిన్ని వార్తలు