మంత్రి పదవి కోసం నేను పెదవులు మూసుకోలేదు: ఈటల

31 Aug, 2021 09:03 IST|Sakshi

తన రాజీనామాతో సీఎం ప్రగతిభవన్‌ వీడారని వ్యాఖ్య

హుజురాబాద్‌లో బీజేపీలో చేరిన పలువురు నాయకులు

ఇల్లందకుంట (హుజురాబాద్‌): పదవుల కోసం పెదవులు మూసుకోలేదని, రైతులు, ప్రజల పక్షాన ప్రశ్నించినందుకు తనను పార్టీ నుంచి పంపించారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం విలాసాగర్‌లో సోమవారం పలువురు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. తాను రాజీనామా చేస్తేనే సీఎం ప్రగతిభవన్‌ నుంచి బయటకు వచ్చారని, దళిత బంధు, పెన్షన్‌లు వచ్చాయన్నారు. ఎంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినా తన మీద ప్రజలకు ఉన్న ప్రేమ, అభిమానం తీసుకుపోలేరన్నారు.

చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం
చదవండి: తెలంగాణలో ఎవరూ ఆకలితో అలమటించొద్దు​​​​​​​

మరిన్ని వార్తలు